బ్రేకింగ్ న్యూస్
మాధవన్ ‘GDN’ కొత్త విడుదల తేదీ ఖరారు.. ఆగస్టు 7న థియేటర్లలోకిభారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవితఅదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!చే’నేత’కు ఏపీ సర్కార్ గౌరవం.. రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతిమాన్‌గఢ్ ధామ్ వేదికగా మారుమోగిన ‘భీల్ ప్రదేశ్’ నినాదంస్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మసీదు తరలింపు వివాదం – ఉద్రిక్త వాతావరణంసోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు ఆకస్మిక ముగింపు – ఆసుపత్రికి తరలింపుమ్యాచ్ రద్దు అయితే ఛాన్స్ ఎవరికి..?సలాం తెలంగాణ రిపోర్టర్ బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్మాధవన్ ‘GDN’ కొత్త విడుదల తేదీ ఖరారు.. ఆగస్టు 7న థియేటర్లలోకిభారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవితఅదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!చే’నేత’కు ఏపీ సర్కార్ గౌరవం.. రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతిమాన్‌గఢ్ ధామ్ వేదికగా మారుమోగిన ‘భీల్ ప్రదేశ్’ నినాదంస్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మసీదు తరలింపు వివాదం – ఉద్రిక్త వాతావరణంసోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు ఆకస్మిక ముగింపు – ఆసుపత్రికి తరలింపుమ్యాచ్ రద్దు అయితే ఛాన్స్ ఎవరికి..?సలాం తెలంగాణ రిపోర్టర్ బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్
అంతర్జాతీయం

పాకిస్థాన్‌పై దాడులకు ఆత్మాహుతి దళాన్ని రంగంలోకి దించిన తాలిబన్లు

పాకిస్థాన్‌పై దాడులకు ఆత్మాహుతి దళాన్ని రంగంలోకి దించిన తాలిబన్లు
  • ఆఫ్ఘన్‌పై పాకిస్థాన్ భారీ వైమానిక దాడులు
  • ప్రతీకారంగా ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసిన తాలిబన్లు
  • ఇది బహిరంగ యుద్ధమేనని ప్రకటించిన పాక్ రక్షణ మంత్రి
  • ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయికి చేరిన పోరు
  • వందలాది మంది మరణించినట్లు ఇరు పక్షాల పరస్పర ఆరోపణలు

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్రరూపు దాల్చాయి. ఆఫ్ఘన్‌లోని ప్రధాన నగరాలపై పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడగా, తాలిబన్లు ప్రతీకారంగా ఆత్మాహుతి దాడుల దళాలను (సూసైడ్ స్క్వాడ్) సిద్ధం చేశారు. “ఇక మా ఓపిక నశించింది, ఇది బహిరంగ యుద్ధం” అని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.పాకిస్థాన్ సైన్యం కాబూల్, కంధహార్, పక్తియా వంటి ప్రాంతాల్లోని తాలిబన్ సైనిక స్థావరాలు, హెడ్‌క్వార్టర్లు, ఆయుధ డిపోలపై ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 133 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులను ధ్వంసం చేశామని పాక్ ప్రకటించింది.

భారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవిత

అయితే, పాకిస్థాన్ వాదనను తాలిబన్లు తోసిపుచ్చారు. తమ ఫైటర్లలో 8 మందే మరణించారని, 13 మంది సామాన్య పౌరులు గాయపడ్డారని తెలిపారు. అంతేకాకుండా, తమ ప్రతిదాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని, 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు క్లెయిమ్ చేశారు.ఈ దాడుల తర్వాత, ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన తమ ప్రత్యేక బెటాలియన్ ఫోటోను ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. పేలుడు పదార్థాలు నింపిన జాకెట్లు, కార్ బాంబులతో ఈ దళాలు పాకిస్థాన్‌లోని ప్రధాన లక్ష్యాలపై దాడులకు సిద్ధంగా ఉన్నాయని తాలిబన్ వర్గాలు తెలిపాయి. 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు (దురంద్ లైన్) వెంబడి తమ దాడులు కొనసాగుతాయని తాలిబన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరు పక్షాలూ చెబుతున్న మృతుల సంఖ్యను స్వతంత్రంగా ధృవీకరించే అవకాశం లేదు. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!