సలాం తెలంగాణ పత్రిక స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా నియమితులైన నరసింహా గౌడ్ బాలగోని గారికి అధికారిక ఐడెంటిటీ కార్డును పత్రిక ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు శుక్రవారం కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎడిటర్ గారు మాట్లాడుతూ—ప్రజా సమస్యలను నిజాయితీగా, నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతను రిపోర్టర్లు భుజాలపై మోస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో వార్తా కవరేజీని మరింత బలోపేతం చేయడంలో బాలగోని నరసింహ గౌడ్ గారి పాత్ర కీలకమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, ప్రజల గొంతుకగా నిలిచే సలాం తెలంగాణ పత్రికకు ఇది మరో ముందడుగు కాగా, నూతన బాధ్యతలు స్వీకరించిన నరసింహ గౌడ్ గారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి
