ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దేవుడి ఆశీస్సులతో తనకు క్లీన్ చిట్ వచ్చిందని కల్వకుంట్ల కవిత తెలిపారు. రాజకీయం చేయాలంటే ధైర్యం అవసరమని, రాజకీయాల్లో ఓటమిని సైతం అంగీకరించగలగాలని ఆమె పేర్కొన్నారు. రెండు నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తానని మీడియా ఎదుట వెల్లడించారు. ఓటమిని తనపై రుద్దితే ప్రజలు ఊరుకోరని స్పష్టం చేశారు.
